Telugu Global
Cinema & Entertainment

సింగిల్ లొకేషన్.. గ్రిప్పింగ్ నెరేషన్

డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ జానర్ తో వస్తోంది దొంగలున్నారు జాగ్రత్త. ఈ సినిమాను సింగిల్ లొకేషన్ లో షూట్ చేసినట్టు వివరించాడు, ఇందులో హీరోగా నటించిన శ్రీసింహా.

సింగిల్ లొకేషన్.. గ్రిప్పింగ్ నెరేషన్
X

దొంగలున్నారు జాగ్రత్త.. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్న డిఫరెంట్ మూవీ. సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను సింగిల్ లొకేషన్ లో షూట్ చేశారు. ఓ రోడ్డు, ఓ గోడ, ఓ కారు.. ఈ సెటప్ లోనే సినిమా మొత్తం చేశారు. అయితే సింగిల్ లొకేషన్ లో చేసినప్పటికీ, సినిమా మాత్రం బోర్ కొట్టించదని అంటున్నాడు ఇందులో హీరోగా నటించిన శ్రీసింహా.

"కథ చాలా ఎక్సయిటింగ్ గా ఉండడంతో ఒకే లొకేషన్ అనే ఫీలింగ్ రాదు. కథ చాలా అద్భుతంగా రావడంతో షూటింగ్ లో కూడా చాలా ఎక్సయిట్ మెంట్ ఉండేది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఆ ఎక్సయిట్ మెంట్ ఫీల్ అవుతారు. ఈ సినిమా కోసం వర్క్ షాప్ కూడా చేశాం. ఒక గంట కార్లో ఉండిపోతే ఎలా వుంటుంది? ఒక పూట కార్లో ఇరుక్కుపొతే ఎలా ఉంటుదని రకరకాలుగా రిహార్సల్ చేసి వర్క్ షాప్ చేశాం."

ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందంటున్నాడు హీరో శ్రీసింహా. ప్రతి సీన్ ఇంట్రస్టింగ్ గా నడుస్తుంటుందని... బలమైన కంటెంట్, పక్కా స్క్రీన్-ప్లే ఉండడం వల్ల నటుడిగా తనకు పెద్ద కష్టం అనిపించలేదని చెబుతున్నాడు.

ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో సతీష్ త్రిపుర దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రీతి అస్రానీ హీరోయిన్ గా నటించగా.. సురేష్ బాబు సినిమాను నిర్మించారు.

First Published:  21 Sep 2022 2:40 PM GMT
Next Story