Telugu Global
Cinema & Entertainment

సిద్ శ్రీరామ్, ఆర్పీ పట్నాయక్ కలిశారు

మెలొడీలకు పెట్టింది పేరైన ఆర్పీ పట్నాయక్ కంపోజిషన్ లో, విలక్షణ గాయకుడు సిద్ శ్రీరామ్ ఓ పాట పాడితే ఎలా ఉంటుంది? అహింస సినిమాతో ఈ కాంబో కలిసింది.

సిద్ శ్రీరామ్, ఆర్పీ పట్నాయక్ కలిశారు
X

ఒకప్పుడు మెలొడీ సాంగ్స్ కు పెట్టింది పేరు ఆర్పీ పట్నాయక్. తనే పాట కంపోజ్ చేసి, స్వయంగా తనే ఆలపించేవారు ఆర్పీ. అలా ఎన్నో హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం అలాంటి మెలొడీలకు పెట్టింది పేరు సిద్ శ్రీరామ్. మంచి మెలొడీ ఆలపించాలంటే అందరూ సిద్ నే ఆశ్రయిస్తున్నారు. మరి ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఆ సందర్భమే ఇది.

సీనియర్ డైరక్టర్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తీస్తున్నాడు. సురేష్ బాబు కొడుకు, రానా తమ్ముడు, రామానాయుడు మనవడు దగ్గుబాటి అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' పాట ని విడుదల చేశారు. ఆర్‌పి పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేయగా.. సిద్ శ్రీరామ్ తన మెస్మరైజింగ్ వాయిస్ తో పాటకు ప్రాణం పోశాడు. ఆర్పీ పట్నాయక్ కు మ్యూజిక్ డైరక్టర్ గా ఇది రీఎంట్రీ మూవీ.

ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో చూపించిన లొకేషన్లు బాగున్నాయి. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. గీతిక హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత, తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తోంది 'అహింస'.



First Published:  20 Sep 2022 1:38 PM GMT
Next Story