Telugu Global
Cinema & Entertainment

WITNESS: మరో సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్

Witness Movie: శ్రద్ధా శ్రీనాధ్ లీడ్ రోల్ పోషించిన సినిమా విట్ నెస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయింది.

WITNESS: మరో సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్
X

పారిశుధ్య కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా తెరకెక్కిన చిత్రం 'విట్ నెస్'. అత్యంత అమానవీయ పద్ధతుల్లో కాల్వలు శుభ్రం చేస్తుంటారు. ప్రాణాలకు తెగించి మరీ మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. అనేక చర్యలు, విధానాలు అమలులో ఉన్నప్పటికీ, దీనివల్ల ప్రతి సంవత్సరం ఎందరో కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఈ సమస్య ఆధారంగా తెరకెక్కిన సినిమా 'విట్ నెస్'. ఇప్పుడీ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 9 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

పార్థిబన్ అనే 20 ఏళ్ల కుర్రాడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం, అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం పోరాడుతుంది. ఆ పోరాటంలో ఆమె గెలిచిందో లేదో తెలియాలంటే 'విట్ నెస్' సినిమా చూడాలి.

పీపువ్ మీడియా బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించాడు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అజగం పెరుమాళ్, సెల్వ తదితరులు నటించారు.




First Published:  3 Dec 2022 3:40 AM GMT
Next Story