Telugu Global
Cinema & Entertainment

మరో క్రైమ్ కామెడీ.. ఈసారి రవితేజ వంతు

నిర్మాతగా రవితేజ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈసారి క్రైమ్ కామెడీ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు మాస్ రాజా.

మరో క్రైమ్ కామెడీ.. ఈసారి రవితేజ వంతు
X

హీరో రవితేజ సొంతంగా బ్యానర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయన బ్యానర్ పేరు ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌. ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్స్, కొత్త నటీనటులను ప్రోత్సహించడం ఈ బ్యానర్ ఉద్దేశం. ఈ బ్యానర్ పై, రవితేజ నిర్మాతగా రాబోతున్న కొత్త సినిమా 'ఛాంగురే బంగారురాజా'.

క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం, నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కుషిత కల్లపు హీరోయిన్. వచ్చినెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది..

''ఛాంగురే బంగారురాజా' టైటిల్ శ్రీ కృష్ణ పాండవీయంలోని పాపులర్ పాట నుండి తీసుకున్నారు. టైటిల్ పోస్టర్‌లో కార్తీక్ రత్నం రెండు భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది. ఈ సినిమాను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.

ముహూర్తం షాట్‌కి రవితేజ క్లాప్ కొట్టగా, హీరో విష్ణు విశాల్ కెమెరా స్విచాన్ చేశాడు. ప్రస్తుతం ఈ హీరో, రవితేజ బ్యానర్ లోనే మట్టి కుస్తీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ముహూర్తపు సన్నివేశానికి రవిబాబు గౌరవ దర్శకత్వం వహించగా.. దర్శకుడు సుధీర్ బాబుకు బివిఎస్ రవి స్క్రిప్ట్ అందించాడు. 'ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్' అనే సంస్థ ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరించనుంది. కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నాడు.





First Published:  11 Aug 2022 1:39 PM GMT
Next Story