Telugu Global
Cinema & Entertainment

రవితేజ వారసుడు వచ్చేశాడు

రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మాధవ్ హీరోగా పరిచయమౌతున్నాడు.

రవితేజ వారసుడు వచ్చేశాడు
X

రవితేజ కొడుకు మహాధన్ ఎప్పుడు హీరోగా మారతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. రాజా ది గ్రేట్ లో జూనియర్ రవితేజగా నటించిన మహాధన్, సోలో హీరోగా వచ్చే రోజు త్వరలోనే ఉందని రవితేజ కూడా ఊరిస్తూ వచ్చాడు. అయితే అంతకంటే ముందు రవితేజ వారసుడు ఒకడు సినిమాల్లోకి వచ్చాడు.

రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా మారాడు. ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), మాధవ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నారు. లక్ష్మీ నరసింహాప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా వస్తున్న ఈ చిత్రానికి ఏయ్... పిల్లా' టైటిల్ ఖరారు చేశారు.

ఇదొక వింటేజ్ ప్రేమకథ. 90ల నాటి లవ్ స్టోరీతో ఇది తెరకెక్కుతోంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలో మాధవ్ సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే తొలి సినిమా.

గతంలో రవితేజతో ఖిలాడీ అనే సినిమా తీసిన రమేష్ వర్మ, ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  10 Aug 2022 2:35 AM GMT
Next Story