Telugu Global
Cinema & Entertainment

Malli Pelli - కోర్టుకెక్కిన 'మళ్లీ పెళ్లి' పంచాయతీ

Malli Pelli Movie - సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా వివాదాల్లో ఇరుక్కుంది. ఈ సినిమాపై కోర్టు కేసు పడింది.

Nareshs Malli Pelli Movie: మళ్లీ పెళ్లి రిలీజ్ తర్వాత ఆటంబాంబ్ పేలుతుంది
X

Naresh's Malli Pelli Movie: మళ్లీ పెళ్లి రిలీజ్ తర్వాత ఆటంబాంబ్ పేలుతుంది

సీనియర్ నటుడు నరేష్ నటించిన తాజా చిత్రం మళ్లీ పెళ్లి. నరేష్ జీవితంలో జరిగిన నిజజీవిత ఘటనలతో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని నరేష్ కూడా పరోక్షంగా అంగీకరించారు. సినిమాకు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా విడుదలకానుండగా.. కోర్టు కేసు పడింది.

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, మళ్లీ పెళ్లి సినిమాపై కేసు వేశారు. ఈ సినిమా తన గౌరవాన్ని కించపరిచేలా ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. సినిమా ప్రసారాన్ని నిలిపివేయాల్సిందిగా కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కేవలం తన గౌరవానికి భంగం కలిగించాలనే దురుద్దేశంతోనే మళ్లీ పెళ్లి సినిమా తీశారనేది ఆమె ఆరోపణ.

మళ్లీ పెళ్లి ట్రయిలర్ లో చాలా విషయాల్ని వెల్లడించారు. నరేష్ కు ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు అయి పెటాకులైన విషయాన్ని అన్నపూర్ణమ్మ క్యారెక్టర్ తో చెప్పించారు. మూడో భార్య ఉందంటూ ఓ క్యారెక్టర్ ను చూపించారు. ఆ పాత్రను వనిత విజయ్ కుమార్ పోషించారు. అదే ట్రయిలర్ లో పవిత్ర లోకేష్ ఎంట్రీ, నరేష్ తో అనుబంధాన్ని చూపించారు.

నరేష్ నిజ జీవితంలో ఉన్న కీలకమైన వ్యక్తులంతా వివిధ పాత్రల రూపంలో మళ్లీ పెళ్లి సినిమాలో ఉన్నారు. కృష్ణ, విజయనిర్మల పాత్రల్ని పరిచయం చేశారు. అదే క్రమంలో రమ్య రఘుపతి పాత్రను కూడా చూపించారని సమాచారం. దీనికితోడు ఓ స్టార్ హోటల్ లో నరేష్-పవిత్ర కలిసి ఉన్నప్పుడు అక్కడ జరిగిన రచ్చను కూడా టీజర్ లో చూపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది..

వీటికితోడు ట్రయిలర్ లో వనిత విజయ్ కుమార్ పాత్రను నెగెటివ్ షేడ్స్ లో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారనే కామెంట్స్ వచ్చాయి.. వీటన్నింటిపై రమ్య రఘుపతి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పంచాయతీ ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  25 May 2023 9:28 AM GMT
Next Story