Telugu Global
Cinema & Entertainment

నేను విడాకులివ్వ‌ను.. వారి పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌ను - న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ పెళ్లి వార్త‌ల‌పై ర‌మ్య ర‌ఘుప‌తి స్పంద‌న‌

న‌రేష్‌, ప‌విత్రా లోకేష్‌ల పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌బోన‌ని ఆమె తేల్చి చెప్పారు. న‌రేష్ త‌న‌కు ఇంకా విడాకులు ఇవ్వ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

నేను విడాకులివ్వ‌ను.. వారి పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌ను - న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ పెళ్లి వార్త‌ల‌పై ర‌మ్య ర‌ఘుప‌తి స్పంద‌న‌
X

తాను, ప‌విత్రా లోకేష్‌ కొత్త సంవ‌త్స‌రంలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ సీనియ‌ర్ సినీ న‌టుడు న‌రేష్ డిసెంబ‌ర్ 31న వీడియో మెసేజ్ ద్వారా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌ల‌పై ఆయ‌న మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి శుక్ర‌వారం మీడియా ఎదుట‌ స్పందించారు. న‌రేష్‌, ప‌విత్రా లోకేష్‌ల పెళ్లి జ‌ర‌గ‌నివ్వ‌బోన‌ని ఆమె తేల్చి చెప్పారు. న‌రేష్ త‌న‌కు ఇంకా విడాకులు ఇవ్వ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఆ కేసు కోర్టులోనే ఉంద‌ని ఆమె చెప్పారు. న‌రేష్‌ని తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని, ఎంతో కాలంగా అత‌ని ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని ఆమె ఆరోపించారు.

న‌రేష్‌ని పెళ్లి చేసుకోవ‌డానికి మా ఇంట్లో వారు అంగీక‌రించ‌లేదు...

న‌రేష్‌తో పెళ్లికి త‌మ ఇంట్లో వారు అంగీక‌రించ‌క‌పోయినా వారి ఒప్పించి పెళ్లి చేసుకున్నాన‌ని వెల్ల‌డించారు. త‌న అత్త‌మ్మ విజ‌య‌నిర్మ‌ల త‌న‌ను రాణిలా చూసుకున్నార‌ని ర‌మ్య తెలిపారు. న‌రేష్‌కు వేరేవాళ్ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని త‌న‌కు పెళ్ల‌య్యాక తెలిసి బాధ‌ప‌డ్డాన‌ని తెలిపారు. ఈ విష‌యాల‌పై ఆయ‌న త‌న‌కు ఎన్నోసార్లు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని వివ‌రించారు. ఆయ‌న మార‌తాడ‌ని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు.

ప‌విత్ర‌ను ఇంటికి కూడా తీసుకొచ్చారు...

ప‌విత్ర‌ను న‌రేష్ ఓసారి త‌మ ఇంటికి తీసుకొచ్చార‌ని ర‌మ్య ర‌ఘుప‌తి చెప్పారు. వారికి `స‌మ్మోహ‌నం` సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని విన్నాన‌ని ఆమె తెలిపారు. త‌మ ఇంటికి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆమెది బెంగ‌ళూరు అని ప‌రిచ‌యం చేశాడ‌ని చెప్పారు. ఆమెను తాను ఎంతో బాగా చూసుకున్నాన‌ని తెలిపారు.

ఎన్నిక‌ల‌ప్పుడు అనుమానం క‌లిగింది...

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు వారిద్ద‌రిపై అనుమానం క‌లిగింద‌ని ర‌మ్య వివ‌రించారు. కొంత‌కాలానికి అదే నిజ‌మైంద‌న్నారు. ఇటీవ‌ల వారు షేర్ చేసిన వీడియో చూసి త‌న‌కు ఎంతో బాధ క‌లిగింద‌ని వివ‌రించారు. సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఏమైనా ఈ వీడియో చేశారా అనే అనుమానం కూడా క‌లిగింద‌ని చెప్పారు.

నా కొడుకు కుంగుబాటుకు గుర‌వుతున్నాడు...

త‌న‌ను ఇబ్బంది పెట్ట‌డానికి న‌రేష్‌, ప‌విత్ర ఇద్ద‌రూ ఇలాంటి ప‌నులు ఎన్నో చేశార‌ని ర‌మ్య ర‌ఘుప‌తి తెలిపారు. వారు చేస్తున్న ప‌నుల వ‌ల్ల త‌న ప‌దేళ్ల కొడుకు కుంగుబాటుకు గుర‌వుతున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాడికి తామిద్ద‌రం విడిపోవ‌డం ఏమాత్రం ఇష్టం లేద‌ని చెప్పారు. నాన్న‌కు విడాకులు ఇవ్వొద్దు.. అంటూ ఓసారి వాడు త‌న‌నుంచి మాట కూడా తీసుకున్నాడ‌ని వివ‌రించారు. తామిద్ద‌రం క‌లిసే ఉంటామ‌ని వాడికి మాట కూడా ఇచ్చాన‌ని ఆమె తెలిపారు.

ఎంత క‌ష్ట‌మైనా పోరాటం చేస్తా...

ఎంత క‌ష్ట‌మైనా తాను పోరాటం చేస్తాన‌ని, న‌రేష్‌తో క‌లిసి ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని ర‌మ్య వివ‌రించారు. త‌మ విడాకుల కేసు కోర్టులో న‌డుస్తూనే ఉంద‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. తానైతే విడాకులు ఇవ్వ‌డానికి సిద్ధంగా లేన‌ని ఈ సంద‌ర్భంగా ఆమె స్ప‌ష్టం చేశారు.

First Published:  6 Jan 2023 11:44 AM GMT
Next Story