Telugu Global
Cinema & Entertainment

'అడవి'ని అందుకే రిలీజ్ చేస్తున్నాం

పుష్కరం తర్వాత అడివి సినిమా మళ్ళీ రిలీజ్ అవుతోంది. కారణం ఏంటి?

అడవిని అందుకే రిలీజ్ చేస్తున్నాం
X

'అడవి'ని అందుకే రిలీజ్ చేస్తున్నాం ఒకసారి యూత్ జనరేషన్ మారుతుంటుంది. అందుకే రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోందని ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. గతంలో నితిన్, ప్రియాంక కొఠారి హీరోహీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "అడవి" సినిమాను విశాఖ టాకీస్ బ్యానర్ పై నిర్మాత నట్టి కుమార్ విడుదల చేసిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది.

మళ్ళీ రీ రిలీజ్ సినిమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో దాదాపు పుష్కరం తర్వాత ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టాడు వర్మ. అప్పట్లో తాము తీసిన టెక్నాలజీని ఇప్పటి జనరేషన్ కు చూపించేందుకే అడవిని రిలీజ్ చేస్తున్నామంటున్నాడు.

"జనరేషన్ మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని చక్కటి సినిమాలను చూడాలని మారుతున్నయూత్ కోరుకుంటుంటారు. అప్పట్లో ఎలా తీశారు? ఎందుకు తీశారు? ఇంకా టెక్నికల్ గా అప్పడు వచ్చిన అప్ డేట్స్ వంటివి చూడాలని మారుతున్న జనరేషన్ ఆశిస్తారు. అడవి సినిమానే తీసుకుంటే ఫారెస్ట్ ఫోటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్ వంటివన్నీ సినిమాకు హైలైట్ గా ఉంటాయి."

ఇలా అడవి సినిమా రిలీజ్ వెనక రీజన్ ను బయటపెట్టాడు వర్మ. ఇక చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలపై ఈసారి నేరుగా మీడియాతో స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. ఆ వార్త తనకు ఆలస్యంగా తెలిసిందని, అక్కడ చిరంజీవితో ఫోటోలు దిగే వ్యక్తులను కాకుండా చిరంజీవినే అనడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని వర్మ అన్నాడు.

First Published:  13 Oct 2022 11:05 AM GMT
Next Story