Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా ప్రకటన

ఇందులో కబడ్డీ ఆటగాడిగా చరణ్ కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్‌కి వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా ప్రకటన
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు, దర్శకుడు సుకుమార్ నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఈ సినిమా ప్రారంభంపై మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రానున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో సినిమాను ప్రారంభించలేదు. కొరటాల శివతో తన తదుపరి ప్రాజెక్టు ఉండగా ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో బుచ్చిబాబు సినిమా చేయడానికి అవకాశం లేకపోవడంతో ఎన్టీఆర్ ఆ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు అదే కథతో బుచ్చిబాబు చరణ్‌తో సినిమా తీస్తున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కబడ్డీ ఆటగాడిగా చరణ్ కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్‌కి వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చరణ్ తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే బుచ్చిబాబుతో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా తన కొత్త సినిమాపై రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు కూడా తనకు అవకాశం కల్పించిన చరణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు.


First Published:  28 Nov 2022 9:22 AM GMT
Next Story