Telugu Global
Cinema & Entertainment

Rakshith Shetty | కెరీర్ లో తొలిసారి 2 భాగాలుగా సినిమా

Rakshith Shetty - సప్తసాగరాలు దాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రక్షిత్ శెట్టి. ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉందంటున్నాడు.

Rakshith Shetty | కెరీర్ లో తొలిసారి 2 భాగాలుగా సినిమా
X

కన్నడనాట రక్షిత్ శెట్టి ఓ ప్రామిసింగ్ హీరో. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు తీస్తాడనే పేరుంది. అయితే బాహుబలి టైపులో ఇతడు రెండు భాగాలుగా ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఎట్టకేలకు అతడికి ఆ అవకాశం వచ్చింది. 'సప్త సాగరాలు దాటి' అనే సినిమా చేశాడు రక్షిత్. కన్నడనాట అది పెద్ద హిట్టయింది. ఇప్పుడా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా తన సినిమా 2 భాగాలుగా వస్తున్న విషయాన్ని వెల్లడించాడు రక్షిత్. అంతేకాదు, రెండో భాగం కూడా 6-7 వారాల గ్యాప్ లోనే వస్తుందనే విషయాన్ని వెల్లడించాడు.

"మొదట 2 భాగాలు అనే ఆలోచన లేదు. అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నాడు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటాడు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగుపరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటాడు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక 2 పార్టులుగా విడుదల చేయాలని ఆయన భావించాడు. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించాను. షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక.. 2 పార్టులుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించింది. మాములుగా మొదటి భాగం, రెండో భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తుంటారు. కానీ మేము 7 వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో మరింత ఈజీగా పయనిస్తారు."

ఇలా తన సినిమా రెండో భాగంపై వివరణ ఇచ్చాడు రక్షిత్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కన్నడనాట పెద్ద హిట్టయింది. తెలుగులో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది.

First Published:  22 Sep 2023 8:18 AM GMT
Next Story