Telugu Global
Cinema & Entertainment

'రామారావు' సరసన అలా ఛాన్స్ వచ్చింది?

మాస్ రాజా పరిచయం చేస్తున్న మరో ముద్దుగుమ్మ రజీషా విజయన్. ఇంతకీ ఈ అమ్మాయికి తెలుగు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా?

రామారావు సరసన అలా ఛాన్స్ వచ్చింది?
X

కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు హీరో రవితేజ. దాదాపు తన ప్రతి సినిమాతో ఓ ముద్దుగుమ్మను తెలుగుతెరపైకి తీసుకొస్తుంటాడు. ఇందులో భాగంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరో అమ్మాయిని టాలీవుడ్ కు తీసుకొచ్చాడు. ఆమె పేరు రజీషా విజయన్. తమిళ, మలయాళ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ భామ, మాస్ రాజా సరసన తనకు ఎలా ఛాన్స్ వచ్చిందో చెప్పుకొచ్చింది.

"దర్శకుడు శరత్ మండవ నేను తమిళ్ లో చేసిన 'కర్ణన్' సినిమా చూసి నాకు కాల్ చేసి 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రాజెక్ట్ గురించి చెప్పారు. రామారావు ఆన్ డ్యూటీ లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్ అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా, శక్తిమంతంగా ఉంటుంది. ఇంత మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది."

ఇలా తన టాలీవుడ్ డెబ్యూ గురించి చెప్పుకొచ్చింది రజీషా. రవితేజపై స్పందిస్తూ, తనకు చిన్నప్పట్నుంచి రవితేజ తెలుసంటోంది. నార్త్ లో రవితేజకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అంటోంది.

"నేను నార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ గారి సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. నా స్నేహితులందరికీ రవితేజ గారు తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ గారికి ఆ రీచ్ ఉంది. రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా ఉంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు."

29న థియేటర్లలోకి వస్తోంది రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాతో కొత్త హీరోయిన్ రజీషా, కొత్త దర్శకుడు శరత్ మండవ జాతకాలు తేలిపోనున్నాయి.

First Published:  23 July 2022 8:32 AM GMT
Next Story