Telugu Global
Cinema & Entertainment

Rajendra Prasad - ఏప్రిల్ లో మొదలు.. జులైలో రిలీజ్

Rajendra Prasad - రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా పేరు షష్ఠిపూర్తి. ఈ సినిమాను 3 నెలల్లో రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Rajendra Prasad - ఏప్రిల్ లో మొదలు.. జులైలో రిలీజ్
X

ఈకాలం ఏ సినిమా చేయాలన్నా కనీసం 6 నెలలు టైమ్ పడుతుంది. పక్కా ప్లానింగ్ తో చేస్తే 4-5 నెలల్లో సినిమాను రిలీజ్ చేయొచ్చు. కానీ ఇక్కడో సినిమాను మాత్రం 2 నెలల్లోనే రిలీజ్ చేయబోతున్నారు. అందులో హీరో రాజేంద్రప్రసాద్.

రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన... ఈ పేర్లు వింటే 'లేడీస్ టైలర్' గుర్తుకొస్తుంది. 'సుజాతా....మై మర్ జాతా' డైలాగును, ఆ సన్నివేశాన్ని, ఆ సినిమాను అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదొకటి. ఆ సినిమా వచ్చిన 37 ఏళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'షష్టిపూర్తి'. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ కుమార్ చౌదరి నిర్మాత.

చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా... సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి క్లాప్ ఇచ్చారు.

'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన చేస్తున్న చిత్రమిది. 'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్‌లో 'ఆస్తులు అంతస్థులు', 'చెట్టు కింద ప్లీడర్', 'ఏప్రిల్ 1 విడుదల' వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్ కూడా ఈ సినిమాతో రిపీట్ అవుతోంది.

సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇదొక న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా 3 నెలల్లో సినిమాను రిలీజ్ చేయాలనేది యూనిట్ టార్గెట్.

First Published:  1 April 2023 5:26 PM GMT
Next Story