Telugu Global
Cinema & Entertainment

కెప్టెన్ మిల్లర్.. హీరోయిన్ ఫిక్స్

ధనుష్ హీరోగా రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

కెప్టెన్ మిల్లర్.. హీరోయిన్ ఫిక్స్
X

ధనుష్ హీరోగా నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కెప్టెన్ మిల్లర్. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాపై రోజుకో అప్ డేట్ ఇస్తూ ప్రాజెక్టుపై బజ్ పెంచుతున్నారు మేకర్స్. మొన్నటికిమొన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సందీప్ కిషన్ ను తీసుకున్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇందులో హీరోయిన్ ను ప్రకటించారు.

కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించనుంది. కోలీవుడ్ తో పాటు, టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా పరిచయమైన హీరోయిన్ కావడంతో, ఈమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

1930-40 సమయంలో జరిగిన ఘటనలతో పీరియాడిక్ మూవీగా వస్తోంది కెప్టెన్ మిల్లర్. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మాతలు. శ్రేయాస్ కృష్ణ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ పై ధనుష్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి.

First Published:  20 Sep 2022 3:54 AM GMT
Next Story