Telugu Global
Cinema & Entertainment

లూసిఫర్‌కి సీక్వెల్: టైటిల్ అనౌన్స్ చేసిన పృథ్వీరాజ్..!

ఇందుకు సంబంధించి పృథ్వీ రాజ్ ఒక వీడియో షేర్ చేశారు. అందులో లూసిఫర్ సీక్వెల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమాకు లూసిఫర్2: ఎంపురాన్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

లూసిఫర్‌కి సీక్వెల్: టైటిల్ అనౌన్స్ చేసిన పృథ్వీరాజ్..!
X

మోహన్ లాల్ హీరోగా మలయాళంలో స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లూసిఫర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇందులో సెకండ్ హీరోగా పృథ్వీరాజ్ నటించారు. ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. ఇందుకు సంబంధించి పృథ్వీ రాజ్ ఒక వీడియో షేర్ చేశారు. అందులో లూసిఫర్ సీక్వెల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమాకు లూసిఫర్2: ఎంపురాన్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

లూసిఫర్‌లో మోహన్ లాల్ తన రాజకీయ గురువు మరణించిన తర్వాత చిక్కుల్లో పడ్డ ఆ కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. స్టీఫెన్ గట్టుపల్లి అనే పాత్రలో మోహన్ లాల్ కనిపించాడు. అతడి అనుచరుడి పాత్రలో పృథ్వీ రాజ్ నటించాడు. అయితే సీక్వెల్‌లో స్టీఫెన్ రాజకీయాల్లోకి రాకముందు అబ్రహం ఖురేషి పేరుతో ఒక మాఫియా సంస్థకు అధినేతగా ఎదగడం, ఆ క్రమంలోనే పృథ్వీ రాజ్‌తో పరిచయం కావడం అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది తదితర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ప్రస్తుతం లూసిఫర్ సినిమా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్వీ రాజ్ పోషించిన పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. నయనతార, యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇక తాజాగా లూసిఫర్‌కు సీక్వెల్ ప్రకటించడంతో చిరంజీవి కూడా ఆ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

First Published:  18 Aug 2022 4:20 AM GMT
Next Story