Telugu Global
Cinema & Entertainment

ఇలాంటి మూవీ ఇప్పటివరకు రాలేదు

దొంగలున్నారు జాగ్రత్త సినిమాతో మరోసారి తెరపైకొస్తోంది హీరోయిన్ ప్రీతి అస్రానీ. తక్కువగా సినిమాలు చేసే ఈ ముద్దుగుమ్మ, ఈ మూవీ తనకు కచ్చితంగా పేరు తెచ్చిపెడుతుందని అంటోంది.

ఇలాంటి మూవీ ఇప్పటివరకు రాలేదు
X

సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. శ్రీ సింహ కోడూరి హీరో. ప్రీతి అస్రాని హీరోయిన్. సర్వైవల్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 23న థియేటర్లలో రానున్న ఈ సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకుంది హీరోయిన్ ప్రీతి అస్రానీ.

"దొంగలున్నారు జాగ్రత్త చాలా యూనిక్ కథ. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. ఇందులో నీరజ పాత్రలో కనిపిస్తాను. కథలో చాలా కీలకమైన పాత్ర నాది. చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి మహిళా నా పాత్రకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే సహజమైన ఘటనలు ఉంటాయి. నా పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే పాత్ర అది. ఇలాంటి పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది."

ఇలా తన పాత్ర గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ప్రీతి అస్రానీ. నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు మాత్రమే తను చేస్తానని, అందుకే దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేశానని అంటోంది.

తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయనే విమర్శను తిప్పికొచ్చింది ప్రీతి అస్రానీ. నటిగా తనకంటూ ఓ గుర్తింపు, స్పేస్ కోసం ప్రయత్నిస్తున్నానని, అందుకే ఆచితూచి సినిమాలు చేస్తున్నానని అంటోంది.

First Published:  19 Sep 2022 1:50 PM GMT
Next Story