Telugu Global
Cinema & Entertainment

ప్రభుదేవా కాళ్లు కదపలేకపోయాడంట

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా. ఇలాంటి వ్యక్తి డాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన సందర్భం ఇది

ప్రభుదేవా కాళ్లు కదపలేకపోయాడంట
X

ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుస్తారు. కెమెరా కంటికి కూడా అందనంత వేగంగా డాన్స్ చేస్తారు. కొరియోగ్రఫీని కొత్త మలుపులు తిప్పిన ఘనుడు. దేశవ్యాప్తంగా తన డాన్స్ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి. అతడు మరెవరో కాదు, ప్రభుదేవా. ఇలాంటి వ్యక్తి కాళ్లు కదపలేకపోయాడట. డాన్స్ చేయలేకపోయాడట. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

"మై డియర్ భూతం అనే సినిమా చేశాను. ఇందులో నేను భూతంగా నటించాను. నేను ఉన్నాను కాబట్టి ఓ పాట పెట్టారు. కరోనా తరువాత ఆ పాటను చిత్రీకరించారు. ఆ పాటను శ్రీధర్ కంపోజ్ చేశారు. చాలా గ్యాప్ రావడంతో.. కాలు కదపలేకపోయాను. వారం రోజులు రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. కరోనా వల్ల పూర్తిగా డాన్స్ కు దూరమయ్యాను. ఆ ప్రభావం ఈ పాటపై గట్టిగా పడింది."

ఇలా తను కాలు కదపలేకపోయాననే విషయాన్ని బయటపెట్టాడు ప్రభుదేవా. ఇలాంటి డాన్సరే కరోనా వల్ల డాన్స్ చేయలేకపోయాడంటే, ఇక మిగతావాళ్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక తను చేసే రోల్స్ పై కూడా స్పందించాడు ప్రభుదేవా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తను చేయనని, విభిన్నమైన పాత్రలు మాత్రమే పోషిస్తానని తెలిపాడు. ప్రస్తుతం చేస్తున్న మైడియర్ భూతం సినిమాతో పాటు, త్వరలోనే ఫుల్ లెంగ్త్ శవంగా కూడా మారబోతున్నాడు ఈ హీరో కమ్ దర్శకుడు కమ్ కొరియోగ్రాఫర్.

First Published:  17 July 2022 7:29 AM GMT
Next Story