Telugu Global
Cinema & Entertainment

సీతారామం కోసం రంగంలోకి దిగిన ప్రభాస్

సీతారామం సినిమా ప్రచారం కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. సినిమాను థియేటర్లలోనే చూడాలని అందర్నీ కోరుతున్నాడు.

సీతారామం కోసం రంగంలోకి దిగిన ప్రభాస్
X

ఊహించినట్టుగానే సీతారామం ప్రచారం కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగాడు. స్వయంగా అశ్వనీదత్ కూతురు స్వప్న చొరవ తీసుకొని, ప్రభాస్ ను ఒప్పించారు. లేదంటే, ఈ స్టార్ బయటకొచ్చే రకం కాదు. అలా సీతారామం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెరిశాడు ప్రభాస్. ఓవైపు తన సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ.. స్వప్న దత్ కోసం టైమ్ కేటాయించాడు.

ప్రభాస్ ఈ సినిమా ప్రచారానికి రావడానికి మరో రీజన్ కూడా ఉంది. ఇదే బ్యానర్ పై ప్రస్తుతం ప్రాజెక్ట్-కె అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. సీతారామం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం, ప్రభాస్ తో చేయాల్సిన షూట్ ను కాస్త పక్కకు జరిపారు మేకర్స్. అలా సీతారామం ఈవెంట్ కు ప్రభాస్ ను తీసుకొచ్చారు.

"సీతారామం ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో, మృణాల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అలాగే రష్మిక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తున్నారు. ఒక ప్రేమ కథని ఇంత భారీగా తీయడం మామూలు విషయం కాదు. స్వప్న లాంటి ప్యాషన్ వున్న నిర్మాతతోనే ఇది సాధ్యపడుతుంది. హను గారు అద్భుతమైన దర్శకుడు. సుమంత్ ఒక పాత్ర చేశారంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలని ఉంది. 'సీతారామం' థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్ళడం మానేస్తామా? మా సినిమా పరిశ్రమకు థియేటరే గుడి. ఈ చిత్రాన్ని కచ్చితంగా అందరూ థియేటర్ లోనే చూడాలి"

ఇలా సీతారామం గురించి గొప్పగా మాట్లాడాడు ప్రభాస్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రభాస్, తన కొత్త లుక్ తో ఈవెంట్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు.

First Published:  4 Aug 2022 6:08 AM GMT
Next Story