Telugu Global
Cinema & Entertainment

Rakshit Shetty | కన్నడ సినిమాను సొంతం చేసుకున్న పీపుల్ మీడియా

Rakshit Shetty - 777 చార్లీ తర్వాత మరో హిట్ కొట్టాడు రక్షిత్ శెట్టి. ఇప్పుడా సినిమా తెలుగులోకి కూడా రాబోతోంది.

Rakshit Shetty | కన్నడ సినిమాను సొంతం చేసుకున్న పీపుల్ మీడియా
X

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఈ బ్యానర్ పై ఉన్నన్ని సినిమాలు మరో బ్యానర్ దగ్గర లేదు. తమ కంపెనీ టైటిల్ కు తగ్గట్టు.. ఓ ఫ్యాక్టరీలా పనిచేస్తోంది ఈ బ్యానర్. దాదాపు 6 సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఓ కన్నడ డబ్బింగ్ సినిమాపై కన్నేసింది ఈ బడా నిర్మాణ సంస్థ.

ఓ వైపు స్టార్ హీరోలతో వరుస చిత్రాలు నిర్మిస్తూనే, మరోవైపు పలు డబ్బింగ్ చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. తాజాగా కన్నడ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది.

హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్‌ని అనౌన్స్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో రక్షిత్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని అంటున్నారు పీపుల్ మీడియా అధినేత, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.

First Published:  15 Sep 2023 6:01 PM GMT
Next Story