Telugu Global
Cinema & Entertainment

People Media | రికార్డ్ సృష్టించబోతున్న పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ

People Media - ఇకపై ప్రతి నెల పీపుల్ మీడియా నుంచి ఓ సినిమా రాబోతోంది. ఈ క్రమంలో ఓ రికార్డ్ కూడా సృష్టించబోతున్నారు.

People Media | రికార్డ్ సృష్టించబోతున్న పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ
X

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా సినిమా రాబోతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్... తన బ్యానర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది నెలకో సినిమా రిలీజ్ చేస్తామన్నారు.

"ఈ ఏడాది మినిమం 15 సినిమాలు విడుదలౌతాయి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ప్రొడక్షన్ లో దాదాపు 6 చిత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఈటీవీ విన్ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. అలాగే దాదాపు 4 సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రతి నెల మా నుంచి ఒక చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది 50 చిత్రాల మైలురాయిని అందుకుంటామని భావిస్తున్నాం."

ఇలా తన ప్రొడక్షన్ కంపెనీ జోరును బయటపెట్టారు విశ్వప్రసాద్. ఇండస్ట్రీలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే 50 సినిమాలు పూర్తిచేసిన సంస్థగా పీపుల్ మీడియా రికార్డ్ సృష్టించబోతోంది.

First Published:  5 Feb 2024 4:06 PM GMT
Next Story