Telugu Global
Cinema & Entertainment

మరో పాన్ ఇండియా సినిమాలో అడివి శేష్

అడివి శేష్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. ఏషియన్ సునీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఈ మేటర్ బయటపెట్టాడు.

adivi sesh
X

మేజర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా, తెలుగులో ఎంత హిట్టయిందో, బాలీవుడ్ లో కూడా అంతే హిట్టయింది. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా అడివి శేష్ ను తమ కార్యాలయాలకు పిలిపించుకొని మరీ సన్మానాలు చేశారు. అంత పెద్ద హిట్టయిన ఆ సినిమా తర్వాత, అడివి శేష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు.

మళ్లీ ఇన్నాళ్లకు తన కొత్త సినిమా ప్రకటించాడు ఈ యంగ్ హీరో. ఏషియన్ సునీల్ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్నారు. దీనికోసం ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా అనుకున్నారు. ఎప్పట్లానే అడివి శేష్, ఈ సినిమా కథ-స్క్రీన్ ప్లేలో భాగస్వామ్యం అయ్యాడు.

అయితే ఈ సినిమా ప్రకటన రావడానికి, సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైమ్ పట్టొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ హీరో చేతిలో 2 సినిమాలున్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాతే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.

ప్రస్తుతం హిట్-2 సినిమా చేస్తున్నాడు అడివిశేష్. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. దీని తర్వాత గూఢచారి-2 చేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే, ఏషియన్ సునీల్ నిర్మాతగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.

First Published:  28 Aug 2022 9:28 AM GMT
Next Story