Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ అభిమానిది అనుమానాస్పద మృతి

బింబిసార ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ అభిమాని మృతిచెందాడు. అతడిది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు.

ఎన్టీఆర్ అభిమానిది అనుమానాస్పద మృతి
X

నిన్న బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిరాం అనే అభిమాని మృతి చెందాడు. కార్యక్రమం చివరి దశకు చేరుకున్న టైమ్ లో అతడు ఉన్నట్టుండి సడెన్ గా పడిపోయాడంట. వెంటనే అతడ్ని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందాడు.

మృతుడికి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం. హైదరాబాద్ కూకట్ పల్లిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. జరిగిన ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

నిన్న ఈవెంట్ కు హాజరైన కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు పెడుతున్నారు. ఈవెంట్ లో తొక్కిసలాట జరిగిందనే అంశాన్ని ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ఎలాంటి తొక్కిసలాట జరగలేదని చెబుతున్నారు. మరోవైపు మృతుడు సాయిరామ్ కు దగ్గర్లోనే ఉన్న మరికొంతమంది, అతడు కాలుజారి కింద పడిపోయాడని అనుకున్నామని తెలిపారు. మరోవైపు సాయిరామ్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతడి కుటుంబీకులు చెబుతున్నారు.

జరిగిన ఘటనపై ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ స్పందించింది. మృతుడి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

First Published:  30 July 2022 11:26 AM GMT
Next Story