Telugu Global
NEWS

ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య‌

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అనారోగ్య కారణాలవల్ల మానసిక వత్తిడితో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

Kantamaneni Uma Maheswari
X

నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి చిన్నకుమార్తె కన్నుమూశారు. ఆమె అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కు నలుగురు కుమార్తెలు. వీళ్లలో కంఠమనేని ఉమామహేశ్వరి నాలుగో కూతురు. పురందీశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి కంటే ఉమామహేశ్వరి చిన్న.

ఇటీవల తన చిన్న కూతురుకు పెళ్లి చేశారు ఉమామహేశ్వరి. ఆ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం సమయంలోనే చంద్రబాబు, దగ్గుబాటి కలిశారు. అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెళ్లి కూడా ఘనంగా జరిగింది. అంతలోనే ఉమమహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలిచివేస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. కొంతమంది విదేశీ పర్యటనలో ఉన్నారు. వాళ్లకు కూడా సమాచారం అందించారు.

ఎన్టీఆర్ కుమార్తెల్లో పురందీశ్వరి, భువనేశ్వరి గురించి చాలామందికి తెలుసు. రాజకీయనాయకురాలుగా పురందీశ్వరి, చంద్రబాబు భార్యగా భువనేశ్వరి బాగా పాపులర్. కానీ ఉమామహేశ్వరి మాత్రం పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు. ఆమె రాజకీయాలు, సినిమాలకు దూరంగా, సాధారణ జీవితం గడిపారు.

First Published:  1 Aug 2022 10:06 AM GMT
Next Story