Telugu Global
Cinema & Entertainment

చరణ్-శంకర్ సినిమా.. అది గాసిప్ మాత్రమే!

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. అంతలోనే సినిమాపై మరో కొత్త రూమర్ మొదలైంది.

చరణ్-శంకర్ సినిమా.. అది గాసిప్ మాత్రమే!
X

టాలీవుడ్ లో గాసిప్స్ కామన్. కాస్త క్రేజ్ తో వస్తున్న ప్రతి ప్రాజెక్టుపై రోజుకో ఊహాగానం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇది కూడా అలాంటిందే. రామ్ చరణ్, శంకర్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి. తాజాగా మరో పుకారు వేగంగా వ్యాపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయంట.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం పెద్ద మేటర్ కాదు. కానీ ఈ మేటర్ లో నిజం లేదు. స్వయంగా యూనిట్ నుంచి ఈ విషయంపై స్పష్టత వచ్చింది.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనే విషయంలో ఎలాంటి నిజం లేదని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తామంతా షూటింగ్ పైనే దృష్టి పెట్టామని క్లారిటీ ఇచ్చారు.

చరణ్-శంకర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉంది. 50శాతం మాత్రమే షూట్ పూర్తయింది. కనీసం 80 శాతం షూట్ పూర్తయిన తర్వాత ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభించాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు.

ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. జీ గ్రూప్ ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించి నాన్-థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది.

రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అతడి సరసన కియరా అద్వానీ, అంజని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  5 Sep 2022 7:34 AM GMT
Next Story