Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | రివ్యూలు ప్రభావం చూపించలేదంటున్న నిర్మాత

Guntur Kaaram - గుంటూరుకారంపై వచ్చిన నెగెటివ్ రివ్యూస్ పై మరోసారి స్పందించారు నిర్మాత నాగవంశీ. నెగెటివ్ రివ్యూలు తమ సినిమాను ప్రభావితం చేయలేకపోయాయని అన్నారు.

Guntur Kaaram | రివ్యూలు ప్రభావం చూపించలేదంటున్న నిర్మాత
X

'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన సంతోషాన్ని పంచుకున్నారు. నెగెటివ్ రివ్యూలు తమ సినిమాను ప్రభావితం చేయలేదని అన్నారు.

"రివ్యూలు సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. విడుదలైన రోజు ఉదయం కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి."

గుంటూరుకారం సినిమాను మాస్ సినిమాగా చాలామంది భావించారని.. అందుకే మిడ్ నైట్ షోల నుంచి నెగెటివ్ టాక్ వచ్చిందన్నారు నాగవంశీ. ఈ మూవీని త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ మూవీగా రిలీజ్ కు ముందు ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయామని, ఆ విషయంలో తాము ఫెయిల్ అయ్యామని అంగీకరించారు.

First Published:  19 Jan 2024 5:16 PM GMT
Next Story