Telugu Global
Cinema & Entertainment

నాగ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులుగా చైతూ-అఖిల్

ఘోస్ట్ కోసం నాగచైతన్య, అఖిల్ రంగంలోకి దిగారు. చాన్నాళ్ల తర్వాత తండ్రితో కలిసి ఫొటోలకు పోజులివ్వబోతున్నారు.

నాగ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులుగా చైతూ-అఖిల్
X

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ ఫంక్షన్ ను మరింత కలర్ ఫుల్ గా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. నాగ్, అఖిల్, చైతూ ఇలా ఒకే వేదికపై కలిసి చాలా రోజులైంది.

'ది ఘోస్ట్' టీమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో అలరిస్తోంది. నిన్న నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, కత్తి ఫైట్ ప్రాక్టీస్ వీడియోను విడుదల చేశారు. అంతకంటే ముందు లిరికల్ వీడియోతో పాటు, టీజర్ కూడా ప్రజెంట్ చేశారు. ఇలా ప్రమోషన్ లో దూసుకుపోతున్న ఈ సినిమా, ఇప్పుడు అక్కినేని హీరోల రాకతో మరింత క్రేజీ ప్రాజెక్టుగా మారింది.

శ్రీవెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య, దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి వస్తున్నాడు ఘోస్ట్.

First Published:  24 Sep 2022 8:22 AM GMT
Next Story