Telugu Global
Cinema & Entertainment

చేతులు కలిపిన యూవీ-మైత్రీ?

టాలీవుడ్ లో రెండు పెద్ద సంస్థలు చేతులు కలిపాయి. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఇకపై కలిసి సినిమాలు నిర్మిస్తాయి.

చేతులు కలిపిన యూవీ-మైత్రీ?
X

చాలామంది హీరోలకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అదే విధంగా చాలా మంది దర్శకులకు అడ్వాన్స్ ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. అటు మైత్రీ మూవీ మేకర్స్, ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోందనే రూమర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలో మైత్రీ-యూవీ కలిశాయి. ఇకపై కలిసి సినిమాలు నిర్మించడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతున్నాయి.

త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప-2 సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ సంస్థ ఫండింగ్ అందించబోతోంది. అటు యూవీ క్రియేషన్స్ సంస్థ దగ్గర రామ్ చరణ్ కాల్షీట్లు ఉన్నాయి. ఆ మేరకు చరణ్ కోసం దర్శకుడ్ని సెట్ చేయబోతోంది మైత్రీ.

ఇక డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి. యూవీకి ఏపీలో డిస్ట్రిబ్యూషన్ బెల్ట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మైత్రీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరవబోతోంది. ఇలా ఓ అవగాహన ప్రకారం ఈ రెండు పెద్ద నిర్మాణ సంస్థలు పనిచేయబోతున్నాయి.

First Published:  5 Nov 2022 12:14 PM GMT
Next Story