Telugu Global
Cinema & Entertainment

Malli Pelli - నరేష్ జీవితానికి చెందిన ఎమ్మెస్ రాజు కథ

MS Raju Malli Pelli - నరేష్ హీరోగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి. ఇది తను రాసుకున్న ఒరిజినల్ స్టోరీ అంటున్నాడు ఎమ్మెస్ రాజు.

Malli Pelli - నరేష్ జీవితానికి చెందిన ఎమ్మెస్ రాజు కథ
X

సీనియర్ నటుడు నరేష్ నటించిన తాజా చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజైంది. తాజాగా ట్రయిలర్ కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు చూస్తే, నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలతో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ఈజీగా అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని దర్శకుడు ఎమ్మెస్ రాజు అంగీకరించడం లేదు.

ఇది పూర్తిగా తన కథ అంటున్నారు ఎమ్మెస్ రాజు. తను రాశాను కాబట్టి అది తన కథే అంటున్నారు. అయితే ఇందులో నరేష్ నిజజీవితం ఎంత శాతం ఉందనేది తెలియాలంటే సినిమా చూడాలంటున్నారు ఈ డైరక్టర్.

"నేను నా సొంత పనుల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఈ సినిమాను మల్టీస్టారర్‌ అనాలో, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ అనాలో నాకే అర్థంకాలేదు. డిసెంబర్‌ 30 నుంచి రకరకాల ప్రమోషన్‌ లో ఈ సినిమా కథేమిటనేది ప్రేక్షకులకు తెలిసిపోయింది. పక్కవాడి జీవితంలో తొంగిచూడాలనే ఆతృత జనాల్లో వుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, మనం ఊరు వెళితే కాలక్షేపం కబుర్లు వస్తుంటాయి. అలా అని ఈ సినిమా అలాంటిది కాదు. నా కెరీర్‌ లో చాలా కష్టపడి చేసిన సినిమా. విజయనిర్మల, కృష్ణ గారు పెట్టిన బేనర్‌. నరేష్‌ గారి 50 ఏళ్ళ కెరీర్‌ ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని నేనొక కథ చెప్పా. అది వారు విని, ఫ్రీడం ఇచ్చారు. ఎంత డెప్త్‌ లోకి వెళతారో వెళ్ళండి అన్నారు. నేను రాశాను కాబట్టి ఇది నా కథా, నరేష్ కథా అనేది రేపు మీరు చూసి తెలుసుకోవచ్చు."

మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్-పవిత్ర నిజజీవిత సంబంధంపై చర్చించారు. ఈ సినిమాలో వాళ్లే హీరోహీరోయిన్లుగా నటించారు. నరేష్ మూడో పెళ్లి, అతడి ఆస్తులు, భార్యతో ఏర్పడిన విభేధాలు లాంటి అంశాల్ని ఈ సినిమాలో చర్చించారు.

First Published:  21 May 2023 5:18 AM GMT
Next Story