Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy: చివరిగా వచ్చిన మాస్ మొగుడు

Mass mogudu song from Veera Simha Reddy: వీర సింహా రెడ్డి మూవీ నుంచి లాస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఇదొక మాస్ సాంగ్.

This week OTT Releases: ఈవారం ఓటీటీదే పైచేయి
X

This week OTT Releases: ఈవారం ఓటీటీదే పైచేయి

బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నాలుగో సింగిల్ 'మాస్ మొగుడు'ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.


బాలకృష్ణ, శ్రుతి హాసన్‌లపై ఈ సాంగ్ తెరకెక్కింది. తమన్ మరోసారి మాస్ బీట్ ఇచ్చాడు. మనో, రమ్య బెహరా ఎనర్జిటిక్‌గా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. ఈ పాటలో బాలకృష్ణ లైవ్లీగా, గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశారు. బాలకృష్ణ గ్రేస్ కు తగ్గట్టుగా శృతి హాసన్ గ్లామరస్ గా కనిపించింది.


భారీ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. లిరికల్ వీడియోలోని ఆఖరి విజువల్స్ లో పవన్ కళ్యాణ్ సెట్ లోకి రావడం కనిపించింది. ఓవరాల్ గా పాట బాగుంది.


ఈ సినిమాలో సాంగ్స్ ఎంత హిట్టయ్యాయో, బ్యాగ్రౌండ్ స్కోర్ అంతకంటే పెద్ద హిట్ అవుతుందని చెబుతున్నాడు దర్శకుడు. కేవలం బీజీఎం కోసం ఈ సినిమాను రెండోసారి చూస్తారని అంటున్నాడు. ఇక తాజాగా రిలీజైన మాస్ మొగుడు సాంగ్ తో వీరసింహారెడ్డి పాటల ప్రమోషన్ ముగిసింది.



First Published:  10 Jan 2023 6:09 AM GMT
Next Story