Telugu Global
Cinema & Entertainment

Mahi V Raghav | యాత్ర-2పై దర్శకుడి ఓపెన్ రియాక్షన్

Mahi V Raghav - యాత్ర-2 సినిమా తీశాడు మహి వి రాఘవ్. తన సినిమాపై ఈ దర్శకుడు ఓపెన్ గా స్పందించాడు.

Mahi V Raghav | యాత్ర-2పై దర్శకుడి ఓపెన్ రియాక్షన్
X

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు.

2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా విడుద‌ల చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మహి వి రాఘవన్ మీడియాతో ఓపెన్ గా మాట్లాడాడు.

"సినిమా విడుదలై ఒక్క రోజే అయింది. సినిమా విడుదల రోజే మేం థియేటర్లకు వెళ్తే రియాల్టీ తెలియదు. సోమవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది. కొంత మంది పాజిటివ్‌గా రివ్యూ ఇచ్చారు. ఇంకొంత మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మా బాధ్యత. విమర్శించారు కదా? నేనేమీ దాన్ని డిఫెండ్ చేసుకోను."

ఇలా యాత్ర-2పై ఓపెన్ గా స్పందించాడు మహి వి రాఘవ్. సినిమా థియేటర్లలోకి వచ్చేసింది కాబట్టి, ఇక యాత్ర-2తో తనకు సంబంధం లేదని ప్రకటించాడు ఈ దర్శకుడు.

First Published:  9 Feb 2024 4:56 PM GMT
Next Story