Telugu Global
Cinema & Entertainment

ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి మహేష్ మూవీ

చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మహేష్-త్రివిక్రమ్ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి మహేష్ మూవీ
X

అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్స్ పైకి రానుంది. ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

మహేష్ మూవీ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు. ఇదొక ఓపెన్ ఎయిర్ సెట్. ఇంకా చెప్పాలంటే, ఖలేజా సినిమాలో పెట్రోల్ బంక్ సెట్ వద్ద తీసిన ఫైట్ లాంటిది ఈ రోజు షూట్ చేయబోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.

ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ కలవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తోంది ఈ సినిమా.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమా రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  12 Sep 2022 3:51 AM GMT
Next Story