Telugu Global
Cinema & Entertainment

మహేష్-చైతూ-ఎన్టీఆర్.. మెమొరబుల్ ఫొటో

మహేష్ ను ఓదార్చే క్రమంలో నాగచైతన్య, ఎన్టీఆర్ అతడితో కలిసి దిగిన ఫొటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్-చైతూ-ఎన్టీఆర్.. మెమొరబుల్ ఫొటో
X

సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఇండస్ట్రీకి చెందిన నటులంతా కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. పక్కనే ఉన్న మహేష్ ను ఓదార్చారు. ఈ సందర్భంగా వచ్చిన ఫొటోల్లో ఒకటి మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.

కృష్ణకు నివాళులు అర్పించిన అనంతరం, మహేష్ బాబును ఓదార్చారు నాగచైతన్య, ఎన్టీఆర్. ఈ సందర్భంగా మహేష్ పక్కన నాగచైతన్య, ఆ పక్కన ఎన్టీఆర్ కూర్చున్నారు. సరిగ్గా ఇలాంటి ఫొటోనే గతంలో కృష్ణ, ఏఎన్నార్, ఎన్టీఆర్ దిగారు. అప్పటి ఆ ఫొటోకు, తాజా స్టిల్ కు బాగా సింక్ కుదిరింది. అయితే వీళ్లు కలిసిన సందర్భం బాధాకరం.

దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు దిగ్గజ నటులు, తాము వెళ్లిపోతూ, తమ నటవారసుల్ని ఇండస్ట్రీకి అందించారంటూ అంతా పోస్టులు పెడుతున్నారు. కృష్ణ వారసుడిగా మహేష్, ఏఎన్నార్ వారసుడిగా చైతూ, ఎన్టీఆర్ వారసుడిగా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తమ హవా చూపిస్తున్నారు.

First Published:  16 Nov 2022 4:22 AM GMT
Next Story