Telugu Global
Cinema & Entertainment

ధోని నిర్మాతగా మహేష్ హీరోగా సినిమా

తెలుగులో ధోని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై తొలి సినిమాగా మహేష్ బాబుతో తీసేందుకు ధోని ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీని కోసం మహేష్ బాబుతో మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అఫిషియల్‌గా ప్రకటన రావాల్సి ఉంది.

ధోని నిర్మాతగా మహేష్ హీరోగా సినిమా
X

టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోని ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు. ఆటకు విరామం ప్రకటించిన తర్వాత వ్యవసాయం, వ్యాపారంతో బిజీబిజీగా మారాడు ధోని. ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నాడు. ధోని ఎంటర్ టైన్మెంట్ అనే బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ బ్యానర్‌పై రోర్ ఆఫ్ లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ద హిడెన్ హిందూ అనే షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాడు. ఇకపై దక్షిణాదికి చెందిన స్టార్ హీరోలతో సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ధోని.

ఈ బ్యానర్‌లో మొదటగా తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయనున్నారు. అలాగే తమిళ అగ్ర హీరో విజయ్‌తో ఒక భారీ సినిమా చేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక కన్నడలో కూడా సినిమాలు నిర్మించేందుకు అక్కడి అగ్ర హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

తెలుగులో ధోని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై తొలి సినిమాగా మహేష్ బాబుతో తీసేందుకు ధోని ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీని కోసం మహేష్ బాబుతో మాట్లాడుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాను భారీ బడ్జెట్‌తో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అఫిషియల్‌గా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నాడు.

First Published:  13 Oct 2022 4:46 AM GMT
Next Story