Telugu Global
Cinema & Entertainment

RRR Oscar - దానయ్య లేకుండానే కీరవాణికి సన్మానం

Keeravani And Chandrabose - ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి, చంద్రబోస్ ను ఘనంగా సన్మానించారు. కానీ దానయ్యను ఆహ్వానించలేదు.

RRR Oscar - దానయ్య లేకుండానే కీరవాణికి సన్మానం
X

టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటునాటు పాటకు కీరవాణికి, చంద్రబోస్ కు సంయుక్తంగా ఆస్కార్ అవార్డ్ అందించారు. దీంతో టాలీవుడ్ లో పెద్ద సంబరం మొదలైంది. కీరవాణి-చంద్రబోస్ ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించారు.

అనుకున్నదే తడవుగా శిల్పకళావేదికలో ఏర్పాట్లు చేశారు. తమకు కావాల్సిన వాళ్లకు ఆహ్వానాలు కూడా అందించారు. నిన్న రాత్రి ఈ వేడుక జరిగింది. కానీ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు డబ్బులు పెట్టిన నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయనకు ఆహ్వానం అందించలేదా లేక అహ్వానం అందినప్పటికీ దానయ్య తప్పుకున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కేవలం దానయ్య మాత్రమే కాదు, టాలీవుడ్ ప్రాతినిధ్యం ఏదీ ఫంక్షన్ లో కనిపించలేదు. పేరుకి తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేస్తున్న సన్మానంగా కలరింగ్ ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి 25 లక్షలు డ్రా చేసి ఖర్చుచేశారు. కానీ టాలీవుడ్ నుంచి ప్రముఖులెవ్వరూ కనిపించలేదు.

హీరోల నుంచి చూస్తే.. ఆర్ఆర్ఆర్ లో నటించిన చరణ్, తారక్ నుంచి ప్రభాస్, మహేష్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, వెంకటేశ్, అల్లు అర్జున్.. ఇలా ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కేవలం రాజశేఖర్, రానా, సుశాంత్ మాత్రమే వచ్చారు.

ఇక దర్శకుల వైపు నుంచి చూస్తే ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి మాత్రమే కనిపించాడు. త్రివిక్రమ్ మెరుపులా వచ్చి ఉరుములా మాయమయ్యాడు. రాఘవేంద్రరావు పెద్ద మనిషి హోదాలో వచ్చారు తప్ప, ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న స్టార్ డైరక్టర్ల జాడ కనిపించలేదు. ఇక హీరోయిన్ల సంగతి సరేసరి. ఉన్నంతలో నిర్మాతలు మాత్రం కనిపించారు.

ఇలా టాలీవుడ్ ప్రాతినిధ్యం లేకుండా, ఆర్ఆర్ఆ హీరోలు, నిర్మాతలు లేకుండా.. కీరవాణి-చంద్రబోస్ ను తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా సత్కరించింది.

First Published:  10 April 2023 2:15 PM GMT
Next Story