Telugu Global
Cinema & Entertainment

రూ.900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు.. బ్రహ్మాస్త్ర మూవీపై కంగనా సెటైర్లు ..

బ్రహ్మాస్త్ర చిత్రంపై నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రూ.900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు.. బ్రహ్మాస్త్ర మూవీపై కంగనా సెటైర్లు ..
X

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజువల్ వండర్స్, గ్రాఫిక్స్ మాయాజాలం తప్ప.. ఆకట్టుకునే కథ.. మనసును హత్తుకునే సన్నివేశాలు, డైలాగ్స్ ఏమీ లేవని క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'కొంతమంది అయాన్ ముఖర్జీని మెచ్చుకుంటున్నారు. ఆయన గొప్ప మేధావి అంటూ ప్రశంసిస్తున్నారు. అటువంటి వాళ్లను జైళ్లో పెట్టాలి. అయాన్ ముఖర్జీ సినిమాను నాశనం చేశాడు. ఇష్టారాజ్యంగా టెక్నీషియన్లను మార్చాడు. రూ.900 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేశాడు' అంటూ విమర్శించారు. సినిమాలో అసలు విషయం లేదు.. అంటూ వ్యాఖ్యానించారు. బ్రహ్మాస్త్ర మూవీకి వివిధ సంస్థలు ఇచ్చిన రేటింగ్స్ ను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.

'ఈ సినిమా కోసం దర్శకుడు 12 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ని మార్చాడు. ప్రొడక్షన్ 35 ఖర్చుల రూపంలో రూ.900 కోట్లను కాల్చి బూడిద చేశాడు. ఇలాంటి వ్యక్తిని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది. కరణ్ జోహార్‌కు సినిమా స్క్రిప్ట్‌ల కంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల మీదే ఆసక్తి ఎక్కువ. ఈ మధ్య దక్షిణాది మీద పడ్డాడు. అక్కడి స్టార్స్ ను బుట్టలో వేసుకొని లబ్ధి పొందుదామనుకున్నాడు. ఆయనకు తగిన శాస్తి జరిగింది.' అంటూ కంగన విమర్శలు గుప్పించారు.

First Published:  10 Sep 2022 8:47 AM GMT
Next Story