Telugu Global
Cinema & Entertainment

రాబోయే చిత్రాల‌కు క‌మ‌ల్‌, విజ‌య్ రెమ్యున‌రేష‌న్ రూ.130 కోట్లు..!

తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోలు ద‌ళ‌పతి విజయ్, కమల్ హాసన్‌లకు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు.

రాబోయే చిత్రాల‌కు క‌మ‌ల్‌, విజ‌య్ రెమ్యున‌రేష‌న్ రూ.130 కోట్లు..!
X

తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోలు ద‌ళ‌పతి విజయ్, కమల్ హాసన్‌లకు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ వీరిద్ద‌రికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ప్రస్తుతం తమ రాబోయే చిత్రాల కోసం వారు పొందబోతున్న భారీ పారితోషికం విష‌యంలో వార్త‌ల‌కెక్కారు. త‌మిళ సినీ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం.. వీరిద్ద‌రూ తమ రాబోయే చిత్రాలకు దాదాపు రూ.130 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

విజయ్ ప్రస్తుతం వరిసు సినిమా షూటింగ్ లో ఉన్నాడు. రూ.120 కోట్లకు పైగా ఈ సినిమాకు రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు సినీ వ‌ర్గాల క‌థ‌నం. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించ‌నున్న త‌న త‌దుప‌రి చిత్రం కోసం విజ‌య్ ఏకంగా రూ.130 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

కమల్ హాసన్ హీరోగా న‌టించిన‌, తాజాగా విడుదలైన విక్రమ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. క‌మ‌ల్‌ కూడా ప్రస్తుతం విక్రమ్‌పై చాలా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూర్య, శివాని నారాయణన్ కూడా నటించారు. ఇప్పుడు ఈ లెజెండ‌రీ న‌టుడు త‌న త‌దుప‌రి చిత్రానికి రూ.130 కోట్లు అందుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్ట‌లేదు. 2020లో ఆగిపోయిన తన రాబోయే చిత్రం భారతీయుడు 2 షూటింగ్ కోసం క‌మ‌ల్‌ ఇప్పుడు సిద్ధమవుతున్నాడు. ఈ శంకర్ దర్శకత్వం వహించే చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుందని భావిస్తున్నారు.

First Published:  6 Sep 2022 5:42 AM GMT
Next Story