Telugu Global
Cinema & Entertainment

థర్డ్ వేవ్ లో రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తోంది

కరోనా థర్డ్ వేవ్ లో రావాల్సిన ఓ సినిమాకు ఇన్నాళ్లకు మోక్షం దక్కింది. జెట్టీ సినిమా ఈ నెలలోనే థియేటర్లలోకి రాబోతోంది.

థర్డ్ వేవ్ లో రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తోంది
X

నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను తీశారు. వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుబ్రమణ్యం దర్శకుడు. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

నిజానికి ఈ సినిమా థర్డ్ వేవ్ టైమ్ లో రావాల్సిన మూవీ. అప్పటికే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. ఇండస్ట్రీలో కొంతమంది ఈ సినిమాను చూశారు కూడా. కానీ బిజినెస్ జరక్క ఇన్నాళ్లూ వెయిట్ చేశారు. ఇప్పుడు విడుదలకు సిద్ధం చేశారు. ఈనెల 28న థియేటర్లలోకి రానుంది జెట్టీ.

చీరాల ప్రాంతంలో, సాగర తీరంలో జరిగిన ఓ ఫిక్షన్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. అత్యంత సహజంగా ఉండేలా ఇందులో సన్నివేశాలు, పాత్రల్ని చిత్రీకరించారు. హీరోయిన్ నందిత శ్వేత, తన కెరీర్ లో తొలిసారి ఈ సినిమాలో విలేజ్ అమ్మాయిగా నటించింది.

మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. కొందరు తమ స్వార్థంతో పోర్టుల పేరుతో మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.

First Published:  5 Oct 2022 4:55 AM GMT
Next Story