Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి చిత్రంలో మహేష్‌కి జోడీగా ఇండోనేషియా బ్యూటీ

మహేష్‌బాబు హీరోగా ప్యాన్‌ వరల్డ్‌ స్థాయిలో చిత్రం రూపొందించనున్న దర్శకుడు రాజమౌళి అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం కోసం విదేశీ నటులను కూడా ఎంపిక చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

రాజమౌళి చిత్రంలో మహేష్‌కి జోడీగా ఇండోనేషియా బ్యూటీ
X

మహేష్‌బాబు హీరోగా ప్యాన్‌ వరల్డ్‌ స్థాయిలో చిత్రం రూపొందించనున్న దర్శకుడు రాజమౌళి అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం కోసం విదేశీ నటులను కూడా ఎంపిక చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మహేష్‌బాబు హీరోయిన్‌గా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ను ఎంపిక చేసే అవకాశముందని తాజా సమాచారం. ఇంతకుముందు నుంచే ఈ ప్రచారం జరుగుతున్నా.. ఇప్పుడు అదే నిజం కానుందని తెలుస్తోంది. చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండటం దీనికి బలాన్నిస్తోంది.

ఇంతకుముందు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు మహేశ్‌ సరసన నటించే అవకాశం ఉందంటూ గాసిప్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఆ జాబితాలోకి చేరింది. అయితే ఈ చిత్రంలో ఎంతమంది హీరోయిన్లు ఉంటారనేది మాత్రం రాజమౌళికే తెలియాలి. ఇక చెల్సియా విషయానికొస్తే.. జకార్తాలో ఆమె తన చదువు పూర్తిచేసింది. 2013లో హాలీవుడ్‌ చిత్రం ’రిఫ్రెన్‌’తో సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత ’స్ట్రీట్‌ సొసైటీ’, ’హెడ్‌షాట్, ‘మే ది డెవిల్‌ టేక్‌ యు’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.

ఇక రాజమౌళి మహేష్‌బాబుతో రూపొందించనున్న చిత్రం కోసం మార్వెల్‌ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న క్రిస్‌ హెమ్‌వర్త్‌ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో అభిమానులు తెగ వైరల్‌ చేస్తున్న ఈ వార్తలన్నీ నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం ఆ చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత ఈ చిత్రంపై దృష్టిపెట్టిన మహేష్‌బాబు ఇటీవలే విదేశాలకు వెళ్లి ట్రెక్కింగ్‌లో శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

First Published:  12 Feb 2024 2:45 AM GMT
Next Story