Telugu Global
Cinema & Entertainment

Gangs Of Godavari | 2 వారాలకే ఓటీటీలోకి..!

Gangs Of Godavari - రిలీజైన 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. విశ్వక్ సేన్ సినిమా ఇది.

Gangs Of Godavari | 2 వారాలకే ఓటీటీలోకి..!
X

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆప్ గోదావరి. కృష్ణ చైతన్య డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినమే 31న థియేటర్లలోకి వచ్చింది.

అలా రిలీజైన 2 వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 14న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. విడుదలైన 2 వారాలకే ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేయడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు సినిమా హిట్టయిందని ప్రకటించి, మరోవైపు ఇలా ఓటీటీకి ఇచ్చేయడం ఏం బాగాలేదని అంటున్నారు.

అన్నట్టు ఈ సినిమా హిట్టయిందంటూ సీక్వెల్ కూడా ప్రకటించారు. విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఎక్కువసార్లు వాయిదా పడిన చిత్రంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిలిచిపోతుంది. లెక్కప్రకారం గతేడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు మే 31న థియేటర్లలోకి వచ్చింది. 2 వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీన్ని బట్టి సినిమా రిజల్ట్ అర్థం చేసుకోవచ్చు.

First Published:  9 Jun 2024 5:07 PM GMT
Next Story