Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. కోల్‌కతా, భోపాల్, ముంబై తదితర ప్రాంతాల్లో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులపై దర్యాప్తు చేస్తోంది.

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
X

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ కేసులో ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.


ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మహదేవ్‌కు సంబంధించి రణ్‌బీర్ కపూర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్నాడు. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి రణ్‌బీర్ భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. కాగా, మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ భారీగా హవాలా ఆపరేషన్స్ చేస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ విచారణలో భాగంగానే రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. కోల్‌కతా, భోపాల్, ముంబై తదితర ప్రాంతాల్లో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో వీటికి సంబంధం ఉన్నట్లు తేలింది. యూఏఈ కేంద్రంగా ఈ బెట్టింగ్ యాప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. అక్కడి నుంచి భారీగా హవాలా రూపంలో డబ్బును తరలిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న రణ్‌బీర్‌ను కూడా విచారణకు పిలిచింది.

బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు గాయకులు, కమెడియన్లు పలువురు ఇటీవల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ కో-ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ పెళ్లికి బాలీవుడ్ లోని ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నారు. దీంతో బెట్టింగ్ యాప్‌తో ఇంకెవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.

First Published:  4 Oct 2023 10:46 AM GMT
Next Story