Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలకే ఎందుకిలా? చెప్పిన టైంకి రాని వీరయ్య పాట

కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఈ పాటని విడుదల చేయలేకపోతున్నామని ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై ఫైర్ అవుతున్నారు.

చిరంజీవి సినిమాలకే ఎందుకిలా? చెప్పిన టైంకి రాని వీరయ్య పాట
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇవాళ రావాల్సిన 'చిరంజీవి శ్రీదేవి' సాంగ్ ఉన్నట్టుండి విడుదల ఆగిపోయింది. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఈ పాటని విడుదల చేయలేకపోతున్నామని ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై ఫైర్ అవుతున్నారు.

చిరంజీవి సినిమాలకు సంబంధించి టెక్నికల్ సమస్యలు రావడం ఇదే తొలిసారి కాదు. చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్ సినిమాకు కూడా ఇలాగే జరిగింది. చెప్పిన టైంకి థార్ మార్ థక్కార్ మార్ పాటని విడుదల చేయకపోవడమే కాక.. ఆ తర్వాత నాలుగైదు రోజులకు కూడా ఆ పాట విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలోని 'చిరంజీవి శ్రీదేవి' అనే పాట విషయంలో కూడా ఇలాగే జరిగింది.

నిజానికి నాలుగు రోజుల కిందటే 'చిరంజీవి శ్రీదేవి' పాటను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తావని మేకర్స్ ప్రకటించారు. సరిగ్గా సమయానికి మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేసింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా పాటను ప్రస్తుతం విడుదల చేయడం లేదని ప్రకటించింది. మమ్మల్ని నమ్మండి.. వేచి ఉండండి..తొందర్లోనే ఆ పాటను మీ ముందుకు తెస్తాం.. అంటూ తెలిపింది.

మైత్రి మూవీ మేకర్స్ చేసిన ప్రకటనతో చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. నాలుగు రోజులకు ముందే డేట్ అనౌన్స్ చేసి.. రేపు విడుదల.. నేడు విడుదల.. ఇంకో గంటలో విడుదల.. అని గంటకు పాట వస్తోందని..ట్వీట్ చేశారని.. అప్పుడు కనిపించలేదా? సమస్య అని ఫైర్ అవుతున్నారు. కాగా.. వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కానుంది.

First Published:  19 Dec 2022 12:40 PM GMT
Next Story