Telugu Global
Cinema & Entertainment

'దొంగలున్నారు జాగ్రత్త' అంటున్న సురేష్ బాబు

శ్రీసింహా కోడూరి, సముత్తరఖని నటించిన కాన్సెప్ట్ మూవీ దొంగలున్నారు జాగ్రత్త. ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది.

దొంగలున్నారు జాగ్రత్త అంటున్న సురేష్ బాబు
X

ఒకేసారి 2 సినిమాలు నిర్మిస్తున్నారు నిర్మాత సురేష్ బాబు. వీటిలో ఒకటి శాకినీ-డాకినీ సినిమా కాగా.. రెండో సినిమా పేరు దొంగలున్నారు జాగ్రత్త. కాన్సెప్ట్ మూవీగా వస్తున్న ఈ సినిమాను సునీత తాటితో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీసింహా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీకి ఇవ్వమని, కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు సురేష్ బాబు. చెప్పినట్టుగానే ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. కీలక పాత్రధారులు సింహా కోడూరి, సముత్తరఖని లుక్స్ ను రివీల్ చేశారు. పోస్టర్ చూస్తుంటే, ఇదొక సీరియస్ మూవీ అని అర్థమౌతోంది. పైగా కారు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిందనే విషయం కూడా తెలుస్తోంది.

చేసిన దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుండగా, కాల భైరవ సంగీతాన్నందిస్తున్నాడు.

First Published:  18 Aug 2022 5:47 AM GMT
Next Story