Telugu Global
Cinema & Entertainment

Dil Raju | గుంటూరుకారం మళ్లీ చూసిన దిల్ రాజు

Dil Raju - మహేష్ హీరోగా నటించిన గుంటూరుకారం సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను మరోసారి చూశాడు దిల్ రాజు. ఆ తర్వాత ఏం జరిగింది?

Dil Raju | గుంటూరుకారం మళ్లీ చూసిన దిల్ రాజు
X

సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీనిపై నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు స్పందించారు.

"రాత్రి ఒంటి గంట షోస్ మిక్స్ డ్ టాక్ వచ్చింది. నేను క్రాస్ చెక్ చేసుకోవటానికి సుదర్శన్ థియేటర్ కి వెళ్లి సినిమా చూశాను. మహేష్ క్యారెక్టర్ ను బేస్ చేసుకుని చేసిన సినిమా ‘గుంటూరు కారం’. తల్లీ, కొడుకు మధ్య ఉండే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్. చివరలో వచ్చే మాస్ సాంగ్ ఇలా అన్నింటిని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది తెలుస్తోంది. మరో నాలుగు రోజులు పండుగ ఉంటుంది. బాగుండే సినిమాను ఎవరూ ఆపలేరు."

ఇలా గుంటూరుకారం సినిమాపై స్పందించాడు దిల్ రాజు. అటు నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాపై రియాక్ట్ అయ్యాడు. బయట జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని, కుటుంబాలతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు.

గుంటూరుకారం సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు. ఓ రీజనల్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం చాలా గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు

First Published:  13 Jan 2024 5:21 PM GMT
Next Story