Telugu Global
Cinema & Entertainment

గ్రాండ్ గా లాంచ్ అయిన ధనుష్ కొత్త సినిమా

ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ప్రారంభోత్సవం నిన్న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది.

గ్రాండ్ గా లాంచ్ అయిన ధనుష్ కొత్త సినిమా
X

జాతీయ అవార్డ్ విన్నర్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా చెన్నైలో ప్రారంభ‌మైంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సందీప్ కిషన్, హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇప్ప‌టికే కెప్టెన్ మిల్లర్ తన అద్భుతమైన ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అలా క్లాప్ కొట్టడానికి ముందే భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ సినిమా.

ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై టి.జి. త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది 'కెప్టెన్ మిల్లర్'.

First Published:  23 Sep 2022 2:40 AM GMT
Next Story