Telugu Global
Cinema & Entertainment

క్లాస్ ట‌చ్‌తో బ‌న్నీ నె క్స్ట్ మూవీ ..!

`పుష్ప` చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్‌గా అరంగేట్రంలోనే దుమ్ము రేపిన అల్లు అర్జున్‌..

అల్లు అర్జున్‌
X

అల్లు అర్జున్‌

`పుష్ప` చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్‌గా అరంగేట్రంలోనే దుమ్ము రేపిన అల్లు అర్జున్‌.. తాజాగా ఈ చిత్రం సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పూర్తి మాస్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ.. క్లాస్ ట‌చ్ ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే క్లాస్ మూవీ కోసం ప్లాన్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో తాజా వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇప్ప‌టికే బ‌న్నీతో మూవీ కోసం కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ వంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. ఇప్ప‌టికే వారితో మూవీ క‌థ‌పై చ‌ర్చ‌లు కూడా జరుగుతున్నాయి. వీటిని కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించే యోచ‌న‌తోనే భారీ క‌థ‌ను లైన్‌లో పెడుతున్న‌ట్టు స‌మాచారం.

అయితే ఈలోగా పుష్ప-2 త‌ర్వాత వ‌చ్చే త‌న మూవీకి క్లాస్ ట‌చ్ ఇవ్వాల‌నే ఉద్దేశంలో బ‌న్నీ ఉన్న‌ట్టు స‌మాచారం. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ హీరోగా రూపొందించిన `అల వైకుంఠ‌పురములో` చిత్రం ఎంత భారీ హిట్ సాధించిందో తెలిసిందే.. ఈ చిత్రం సౌత్‌లో సంచ‌ల‌నాలు సృష్టించింది. ఈ చిత్రంలోని పాట‌లు యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూడ్‌గా రికార్డుల‌కెక్క‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న త‌ర్వాతి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించాల‌ని బ‌న్నీ ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే డిస్క‌ష‌న్స్ కూడా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీ కూడా క్లాస్ ట‌చ్‌లోనే ఉంటుంద‌ని స‌మాచారం. దీనిని ప్యాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం బ‌న్నీ ఇమేజ్‌ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం త‌ర్వాత త్రివిక్ర‌మ్‌-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లోనే ప్లాన్ చేస్తున్న ఈ మూవీ మ‌రెన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  24 Sep 2022 10:12 AM GMT
Next Story