Telugu Global
Cinema & Entertainment

టర్కీలో బాలయ్య-శృతిహాసన్ కొత్త సినిమా

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో మొదలైంది. టాకీతో పాటు, యాక్షన్ పార్ట్ షూటింగ్ కూడా జరుగుతోంది.

టర్కీలో బాలయ్య-శృతిహాసన్ కొత్త సినిమా
X

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ టర్కీలోని ఇస్తాంబుల్ వెళ్ళింది. సినిమాలోని ప్రముఖ నటీనటులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్ లొకేషన్ నుండి బాలకృష్ణ, శృతిహాసన్‌లతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. టాకీ పార్ట్ తో పాటు, కొంత యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.

మేకర్స్ ఇటివలే బాలకృష్ణ పుట్టినరోజున రెండు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్‌లను అందించారు. ఫస్ట్ హంట్ వీడియో, ఆపై మాస్ పోస్టర్ విడుదల చేశారు. ఈ రెండింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రంతో దునియా విజయ్‌, టాలీవుడ్ కు విలన్ గా పరిచయమౌతున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ మరో కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

First Published:  31 Aug 2022 4:32 AM GMT
Next Story