Telugu Global
Cinema & Entertainment

Anupama Parameswaran | రాక్షసుడు జోడీ కలిసింది

Anupama Parameswaran - టిల్లూ స్క్వేర్ సినిమాతో ఊపుమీదున్న అనుపమ పరమేశ్వరన్, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Anupama Parameswaran | రాక్షసుడు జోడీ కలిసింది
X

ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది అనుపమ పరమేశ్వరన్. ఎందుకంటే, ఆమెకిప్పుడు స్టార్ డమ్ వచ్చింది. టిల్లూ స్క్వేర్ సినిమా తర్వాత ఆమె క్రేజ్ పెరిగింది. అందుకే ఆ క్రేజ్ ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది అనుపమ. కేవలం మంచి కథలు, తన పాత్రకు ప్రాధాన్యం ఉండే సినిమాలు మాత్రమే ఎంచుకోవాలని ఫిక్స్ అయింది.

ఇందులో భాగంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది ఈ కేరళ బ్యూటీ. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి రాక్షసుడు సినిమా చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు కలవబోతున్నారు.

వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు మురళీ కిషోర్. ఇప్పుడు తన మలి ప్రయత్నంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఈ సినిమాకు కిష్కిందాపురం అనే టైటిల్ అనుకున్నారు. కానీ చాలామందికి ఆ టైటిల్ నచ్చలేదు. దీంతో మరో టైటిల్ కోసం వెదుకుతున్నారు. టైటిల్ ఫిక్స్ అయిన వెంటనే సినిమా ప్రకటన వస్తుంది.

First Published:  19 May 2024 8:50 AM GMT
Next Story