Telugu Global
Cinema & Entertainment

Aadi Saikumar: కొత్త ఏడాదిలో మరో కొత్త ప్రయత్నం

Aadi Saikumar - ఆదిసాయికుమార్ కొత్త సినిమా రెడీ చేశాడు. సీఎస్ఐ సనాతన్ సినిమాను మార్చిలో విడుదల చేయబోతున్నారు.

Aadi Saikumar: కొత్త ఏడాదిలో మరో కొత్త ప్రయత్నం
X

హీరో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్ గా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం "సీఎస్ఐ సనాతన్". డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదల తేదీ లాక్ అయింది. మార్చి 10న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో చిత్రంపై అంచనాలు పెరిగాయి. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా కూడా గ్రిప్పింగ్ సన్నివేశాలతో సాగుతుందని చెబుతున్నారు మేకర్స్.

ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ చిత్రానికి శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ లో అజయ్ శ్రీనివాస్ నిర్మించారు.

సినిమాలో ఆదిసాయికుమార్ సరసన మిషా నారంగ్ హీరోయిన్ గా నటించింది. అలీ రెజా, నందిని రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనీష్ సోలోమాన్ సంగీతం అందించాడు. ఈ ఏడాది ఆది సాయికుమార్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఈ మూవీతో అతడు బోణీ కొడతాడో లేదో చూడాలి.

First Published:  8 Feb 2023 4:03 AM GMT
Next Story