Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ మూవీలో రెండో పాట ఎలా ఉందంటే?

Guntur Kaaram - గుంటూరు కారం నుంచి మరో సాంగ్ వచ్చింది. ఈ పాట ఎలా ఉంది? అంచనాల్ని అందుకుందా?

Guntur Kaaram: షూటింగ్ ఇంకా ఉందా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, హారిక & హాసిని క్రియేషన్స్ తో చేతులు కలిపింది. అదే 'గుంటూరు కారం'.

ఈ చిత్రం మొదటి టీజర్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మహేష్ మాస్ లుక్‌ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ వెంటనే మొదటి గీతం "ధమ్ మసాలా"ని విడుదల చేయగా, అది కూడా హిట్టయింది. ఇప్పుడు రెండో సాంగ్ ను కూడా విడుదల చేశారు.

"ఓ మై బేబీ" అనే లిరికల్ సాంగ్ రిలీజైంది. ఇదొక మెలొడీ. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి బిగ్ సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తున్నాడు.

త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-థమన్ కలయికల్లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు 'గుంటూరు కారం' కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ తాజా పాట అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ మెలోడీ సాంగ్ ను శిల్పా రావు పాడగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

సినిమాలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. మీనాక్షి చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తోంది. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిసున్నారు. గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

First Published:  14 Dec 2023 1:58 AM GMT
Next Story