Telugu Global
Business

నేడు (04-12-2022) కూడా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశీయంగా కిలో వెండి ధర రూ.900 మేర పెరిగి రూ.65,200 లకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

నేడు (04-12-2022) కూడా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజూ పసిడి, వెండి ధరల్లో మార్పులు చేర్పులు తెలిసిన విషయమే. గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర నేడు కూడా పెరిగింది. గత వారమంతా దాదాపు స్థిరంగానే ఉన్న బంగారం ధర.. శుక్రవారం నుంచి పెరగడం ఆరంభించింది. శుక్రవారం స్వల్పంగా అంటే 10 గ్రాములపై రూ.200 పెరిగిన ధర.. శనివారానికి వచ్చే వరకూ రూ.500 పెరిగింది. ఇక నేడు రూ.220 వరకూ పెరిగింది. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.200 మేర పెరిగి రూ.49,450కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 మేర పెరిగి రూ.53,950 కు చేరుకుంది.ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.900 మేర పెరిగి రూ.65,200 లకు చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,450.. రూ.53,950

విజయవాడలో రూ.49,450.. రూ.53,950

విశాఖపట్నంలో రూ.49,450.. రూ.53,950

ఢిల్లీలో రూ.49,600.. రూ.54,100

ముంబైలో రూ.49,450.. రూ.53,950

చెన్నైలో రూ.50,160.. రూ.54,720

కోల్‌కతాలో రూ.49,450.. రూ.53,950

బెంగళూరులో రూ.49,500.. రూ.54,000

కేరళలో రూ.49,450.. రూ.53,950

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600

విజయవాడలో రూ.71,600

విశాఖపట్నంలో రూ.71,600

ఢిల్లీలో రూ.65,200

ముంబైలో రూ.65,200

చెన్నైలో రూ.71,600

బెంగళూరులో రూ.71,600

First Published:  4 Dec 2022 4:13 AM GMT
Next Story