Telugu Global
Andhra Pradesh

లోకేష్‌కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్..!

చంద్రబాబుతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ సమావేశమై 24 గంటలు గడవక ముందే.. ఏపీలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల నారా లోకేష్‌కు క్రిస్మస్‌ కానుక పంపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

లోకేష్‌కు షర్మిల క్రిస్మస్ గిఫ్ట్..!
X

వైఎస్సార్‌, నారా ఫ్యామిలీ.. రాజకీయంగా ప్రత్యర్థులు. వైఎస్సార్‌ మరణం తర్వాత కూడా ఆ రాజకీయం వైరం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్‌ అధికారంలో ఉంటే.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం షర్మిల కూడా తన వంతు పాత్ర పోషించారు. బైబై బాబు అంటూ రాష్ట్రమంతా ఒక ట్రెండ్ సృష్టించారు.

ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో షర్మిల తెలంగాణకు వెళ్లి సొంతంగా పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని షర్మిల చాలాసార్లు ప్రకటించారు కూడా. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబుతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌ సమావేశమై 24 గంటలు గడవక ముందే.. ఏపీలో మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల నారా లోకేష్‌కు క్రిస్మస్‌ కానుక పంపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.


షర్మిల పంపిన కానుకలు రిసీవ్ చేసుకున్న నారా లోకేష్‌.. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నారా ఫ్యామిలీ తరఫున క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

First Published:  24 Dec 2023 7:33 PM GMT
Next Story